తప్పు చేస్తే దొరకక తప్పదు

Apr 16 2024, 10:27

భద్రాద్రి గోదావరి 2వ వంతెనపై రాకపోకల ప్రారంభం

భద్రాద్రి వాసుల కష్టాలు సగం తీరినట్టే. గోదావరి నదిపై భద్రాచలం వద్ద నిర్మించిన రెండో వంతెన ప్రారంభమైంది.

కలెక్టర్‌ ప్రియాంక అల, ఎస్పీ రోహిత్‌రాజ్‌ ప్రారంభించగా.. ఉన్నతాధికారులు నూతన వంతెనపై తమ వాహనాలు నడిపారు. మిగతా వాహన దారులు సారపాక వైపు నుంచి భద్రాచలం వైపునకు రాకపోకలు సాగించారు.

2015 ఏప్రిల్‌ 1వ తేదీన కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ, అప్పట్లో రాష్ట్ర రహదారు లు, భవనాల శాఖామంత్రి గా ఉన్న తుమ్మల నాగేశ్వర రావు ఈ వంతెనకు శంకుస్థా పన చేశారు.

అనంతరం వివిధ కారణా లతో నిర్మాణం జాప్యం కాగా.. ఇటీవల మళ్లీ మంత్రి పదవి చేపట్టిన తుమ్మల నాగేశ్వరరావు పనులను పూర్తి చేయించేందుకు చొరవచూపారు.

శ్రీరామనవమికల్లా కొత్త వంతెనను అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించ డంతో అధికారులు పనులు వేగవంతం చేయించారు. ఇప్పటికే ఉన్న పాత బ్రిడ్జితో పాటు దీన్ని పూర్తిస్థాయిలో ప్రయాణికులు, భక్తులకు అందుబాటులోకి తెచ్చారు.

వంతెన అందుబాటులోకి రావడంతో భద్రాచలం వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమకు రవాణా సమస్య కాస్త తీరినట్టేనని అంటున్నారు. స్థానిక ప్రజలు...

తప్పు చేస్తే దొరకక తప్పదు

Apr 16 2024, 10:26

కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కి గౌడ్ తల్లి అనసూయమ్మ కన్నుమూత

కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ తల్లి అనసూయమ్మ సోమవారం సాయంత్రం కన్నుమూశారు.

వయసు మీదపడడంతో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆమె అనారోగ్య పరిస్థితి విషమించడంతో ఆస్పత్రికి తరలించారు. అప్పటికే చనిపోయిందని వైద్యులు తెలిపారు.

అనసూయమ్మ మృతిపట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి దామోదర రాజ నర్సింహ, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి సీతక్క, మాజీ ఎంపి కెవిపి రామచంద్రారావుతో పలువురు నాయకులు సంతాపం తెలిపారు.

కాంగ్రెస్ ఎంఎల్‌ఎ కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి, భువనగిరి ఎంపి అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు మధుయాష్కీ ఇంటికి వెళ్లి ఆమె పార్థివదేహానికి నివాళులర్పించారు...

తప్పు చేస్తే దొరకక తప్పదు

Apr 16 2024, 10:05

జయశంకర్ భూపాలపల్లి జిల్లాపై ఐజీ రంగనాథ్ స్పెషల్ ఫోకస్

జయశంకర్ భూపాలపల్లి జిల్లా పోలీసు శాఖలో జరుగుతున్న సంఘటనలపై మల్టీ జోన్ 1 ఐజి రంగనాథ్ ప్రత్యేక దృష్టి పెట్టారు.

పోలీసుల పనితీరు పై వస్తున్న ఆరోపణలు తన దృష్టికి వెళ్లిన వెంటనే తక్షణమే స్పందిస్తూ బాధ్యులపై శాఖ పరమైన చర్యలకు అదేశిస్తున్నారు.

ఇటీవల మొగుళ్లపల్లిలో ఓ రౌడి షీటర్ జన్మదిన వేడు కలు ఠాణాలో జరుపగా వెంటనే స్పందించి సంబం ధిత ఎస్సై పై శాఖాపరమైన చర్యలు చేపట్టి ఆసిఫాబాద్ జిల్లాకి బదిలి చేశారు.

తాజాగా సోమవారం మహా దేవపూర్ లో జరిగిన ఘట నపై స్పందించి సంబంధిత ఎస్సై ప్రసాద్ ను విఆర్ కు బదిలీ చేయగా , హెడ్ కానిస్టేబుల్ సోయం శ్రీనివాస్ ను సస్పెండ్ చేశారు.

అదేవిధంగా స్టేషన్ పరిధిలో వున్న మరో 7గురి ఒక హెడ్ కానిస్టేబుల్ పాటు మరో ఆరుగురి సిబ్బంది పై బదిలి వేటు వేశారు. దీంతో జిల్లా లో పని చేస్తున్న పోలీసు అధికారులు, సిబ్బందిలో అలజడి మొదలైంది.

ఐజి తీసుకుంటున్న శాఖ పరమైన చర్యలతో జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Apr 16 2024, 10:03

కొమరంభీం జిల్లాలో పులి కదలికలు: ఫారెస్ట్ అధికారుల హెచ్చరిక

కొమరంభీం జిల్లా పులి సంచారం భయాందోళనకు గురి చేస్తుంది. కాగజ్ నగర్ అటవీ ప్రాంతంలో పులి జాడలను అధికారులు గుర్తించారు. పులి సంచారం నేపథ్యంలో అంకుశాపూర్ వాంకిడి వైపు వెళ్లే దారిలో సోమవారం సాయంత్రం 6 నుంచి రాకపోకల నిషేధం విధించారు.

ఆ ప్రాంతంలో వన్య ప్రాణుల సంచారానికి ఆటంకం కలగకుండా ఉండడం కోసం అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

అంకుశా పూర్ వాంకిడి రహదారి వైపు వన్య ప్రాణుల కదలికలు ఉన్నాయన్న ఉద్దేశంతోనే ముందస్తుగా అధికారులు అప్రమత్తం అయ్యారు.

ఎండాకాలంలో ఎక్కువగా రహదారి వైపు పులులు లేదా ఇతర అటవీ జంతు వులు వచ్చే అవకాశం ఉందని గ్రామస్థులను ఫారెస్ట్ సిబ్బంది అలెర్ట్ చేశారు. జాగ్రత్తగా ఉండాలని సూచించారు...

తప్పు చేస్తే దొరకక తప్పదు

Apr 16 2024, 10:01

హైదరాబాద్ లో దారుణం…ఓ యువకుడి హత్య

హైదరాబాద్ బహదూర్ పూరా లో సోమవారం సాయంత్రం దారుణం చోటు చేసుకుంది.

ఖలీల్ అనే యువకుడు దారుణ హత్యకు గుర య్యాడు. అసద్ బాబా నగర్ లో ఖలీల్ ను కత్తు లలో విచక్షణార హితంగా పొడిచి చంపారు.

దుండగులు. కన్న తండ్రి ముందే కొడుకు హత్యకు గురయ్యాడు.వెంటాడి వేటాడి చంపారు హంత కులు. అడ్డు వచ్చిన తండ్రిని బెదిరించారు.

దుండగులు. ఇక హుటాహు టిన ఘటన స్థలానికి చేరు కున్న పోలీసులు… హంతకు ల కోసం గాలిస్తున్నారు. అటు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఈ సంఘటనలో నలుగురు హంతకులు ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. వారి వద్ద తల్వార్లు ఉన్నట్లు తెలిపారు యువకుడి ఖలీల్ తండ్రి. పాత కక్ష్యలు దృష్టిలో పెట్టుకుని చేసి ఉంటారని పోలీసులు చెబుతున్నారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Apr 16 2024, 10:00

రెండేళ్ల చిన్నారి ప్రాణం తీసిన స్కూల్ బస్సు

స్కూల్ బస్సు ఢీకొని రెండేళ్ల చిన్నారి మృతిచెందిన ఘటన కరీంనగర్ జిల్లా మల్యాల మండలంలో ఈరోజు ఉదయం చోటు చేసుకుంది.

మద్దుట్ల గ్రామానికి చెందిన ఎండి ఆలిఫా అనే రెండేళ్ల చిన్నారి సోదరుడు పాఠశా లకు వెళ్తూ స్కూల్ బస్సులో కూర్చుకున్నాడు.

తన సోదరునితో వెళ్లాలని ఆ చిన్నారి బస్సు ముందు కు వెళ్లింది. ఇది గమనించని డ్రైవర్ స్కూల్ బస్సు ముందుకు పోనించాడు. ఆలిఫా తలపై టైరు ఎక్కడంతో తలకు తీవ్ర గాయమై మరణించింది.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Apr 16 2024, 09:58

ఎన్నికల నేపథ్యంలో ఏపీ, తెలంగాణ సీఎస్‌ల కీలక సమావేశం

లోక్ సభ ఎన్నికల నేప థ్యంలో నిర్వహణపై రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు సోమవారం సాయంత్రం సమావేశమయ్యారు.

హైదరాబాద్‌‌లోని సచివా లయంలో తెలంగాణ సీఎస్ శాంతికుమారి, ఏపీ సీఎస్ జవహర్ రెడ్డిలు సమావేశ మయ్యారు. ఎన్నికల నేప థ్యంలో మరింత సమన్వ యంతో పని చేయాలని ఇరువురు సీఎస్‌లు నిర్ణయించారు.

సరిహద్దు జిల్లాల కలెక్టర్లు, అధికారులతో సమన్వయ భేటీలు జరిగినట్లు అధికా రులు వెల్లడించారు. పోలింగ్ ముగిసే వరకు పకడ్బందీగా వ్యవహరిం చాలని నిర్ణయించినట్లు తెలిపారు.

అక్రమ మద్యం, డ్రగ్స్‌ రాకుండా సరిహద్దుల్లో అప్రమత్తం చేసినట్లు చెప్పారు. గోవా, కర్ణాటక నుంచి మద్యం రాకుండా సరిహద్దుల్లో నిఘా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అక్రమ మద్యం, ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు వివిధ వస్తువుల రవాణా, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేశామన్నారు.

శాంతిభద్రతల పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని, ఇదే వాతావరణాన్ని పోలిం గ్ వరకు పకడ్బందీగా కొనసాగించేందుకు ఉభయ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల సమావేశం దోహదపడుతుందన్నారు.

తెలంగాణ తరఫున పోలీస్ శాఖ ద్వారా 36 అంతరాష్ట్ర చెక్‌పోస్టులు, ఆటవీ శాఖకు సంబంధించి మూడు అంత రాష్ట్ర చెక్‌పోస్టులు, ఎక్సైజ్‌ శాఖ ఎనిమిది, 224 ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బృందాలు, వాణిజ్యపన్నుల శాఖ ద్వారా ఏడు చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి 24 గంటల పటిష్టమైన గస్తీని ఏర్పాటు చేసినట్లు తెలంగాణ సీఎస్ తెలిపారు.

తెలంగాణలో తీవ్రవాద ప్రాబల్యం లేదని, ఛత్తీస్‌గఢ్‌ నుంచి మావోయిస్టుల కార్యకలాపాలు జరుగ కుండా ఇరురాష్ట్రాలు పోలీసులు, కేంద్ర బలగాలు పటిష్టమైన సమన్వయంతో పని చేస్తున్నాయన్నారు. ఏపీ సీఎస్‌ జవహర్‌రెడ్డి మాట్లాడుతూ…

ఆంధ్రప్రదేశ్ శాసనసభ, లోక్ సభ స్థానాలకు ఒకేసారి ఎన్నికలు జరుగుతున్నం దున ఈ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేం దుకు పూర్తిస్థాయి సమన్వ యంతో కృషి చేస్తున్నామ న్నారు...

తప్పు చేస్తే దొరకక తప్పదు

Apr 15 2024, 10:23

బీజాపూర్ ఎన్ కౌంటర్లకు నిరసనగా బందుకు పిలుపునిచ్చిన మావోయిస్ట్ పార్టీ

ఛత్తీస్‌గడ్: మావోయిస్ట్ పార్టీ నేడు బంద్‌కు పిలుపునిచ్చింది. బీజాపూర్ జిల్లా ఎన్ కౌంటర్లకు నిరసనగా సెంట్రల్ రీజియన్ బంద్‌ నిర్వహించతలపెట్టింది..

తెలంగాణ, ఏపీ, ఒడిషా, ఛత్తీస్‌గడ్ (Chattisgarh), మహారాష్ట్ర పరిధిలో బంద్‌కు పిలుపునిచ్చింది. దీంతో భద్రాద్రి ఏజెన్సీలో హై అలర్ట్‌కు పోలీసులు (Police) పిలుపునిచ్చారు. మావోయిస్ట్‌ల ఏరివేత టార్గెట్‌గా భారీగా భద్రతా బలగాలు కూంబింగ్ చేస్తోంది. లోక్‌సభ ఎన్నికల వేళ కాల్పుల మోతతో ఛత్తీ్‌సగఢ్‌ రాష్ట్రం బీజాపూర్‌ దద్దరిల్లింది. వరుస ఎన్‌కౌంటర్లతో విలవిల్లాడుతోంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ తరుణంలో సెంట్రల్ రీజియన్ బంద్‌కు పిలుపునిచ్చింది.

తెలంగాణ.. ఛత్తీస్‌గడ్ (Chattisgarh) సరిహద్దు దండ కారణ్యం యుద్ధ భూమిగా మారింది. ఒక ఎన్‌కౌంటర్ మరువక ముందే మరో ఎన్‌కౌంటర్ జరుగుతోంది. పెద్దగా కాలవ్యవధి కూడా లేకుండానే దండకారణ్యంలో తుపాకుల మోత మోగుతోంది. మొన్నటికి మొన్న ఛత్తీ్స్‌గడ్ దండకారణ్యంలో జరిగిన భారీ ఎన్‌కౌంటర్ మరువక ముందే మరో ఎన్‌కౌంటర్ జరిగింది. బీజాపూర్ జిల్లా పూజారి కాంకేర్... ములుగు జిల్లా సరిహద్దు కర్రి గుట్టల వద్ద భారీ ఎన్ కౌంటర్ జరిగింది. పోలీస్ (Police) బలగాల కాల్పుల్లో ముగ్గురు మావోయిస్ట్‌లు మృతి చెందారు. ఈ క్రమంలోనే ఏకే 47.. లైట్ మెషీన్ గన్,12 బోర్ తుపాకులను సోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

బీజాపూర్ ఎస్పీ జితేంద్ర యాదవ్ ఎన్‌కౌంటర్ జరిగిన విషయాన్ని ధృవీకరించారు. తెలంగాణ గ్రే హౌండ్స్... ఛత్తీస్ గడ్ పోలీస్ జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. తెలంగాణ సరిహద్దులో పోలీసులు భారీగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. రెండు వారాల వ్యవధిలో మూడు భారీ ఎన్ కౌంటర్స్ జరిగాయి. బీజాపూర్ జిల్లా బాసగూడ ఎన్ కౌంటర్‌లో ఆరుగురు మావోయిస్ట్ లు మృతి చెందారు. బీజాపూర్ జిల్లా కోర్చోలి ఎన్‌కౌంటర్ లో 13 మంది మావోయిస్టులు.. ఇవాళ సరిహద్దు కర్రిగుట్టల వద్ద ఎన్ కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్ట్ లు మృతి చెందారు. దీంతో సరిహద్దు గ్రామాల ప్రజలు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Apr 15 2024, 10:21

నేటి నుంచి మళ్ళీ జగన్ మేమంతా సిద్ధం యాత్ర

దాడి ఘటన తర్వాత కోలుకున్న సీఎం జగన్ నేటి నుంచి మేమంతా సిద్ధం బస్సు యాత్రను కొన సాగించనున్నారు.

మొన్న కేసరపల్లి దగ్గర నిలిచిపోయిన యాత్రను.. ఈరోజు అక్కడి నుంచే తిరిగి ప్రారంభించనున్నారు. కాసేపట్లో ప్రారంభంకానున్న జగన్ యాత్ర గన్నవరం, ఆత్కూరు, వీరవల్లి క్రాస్, హనుమాన్ జంక్షన్, పుట్ట గుంట మీదుగా యాత్ర కొనసాగనుంది.

మధ్యాహ్నం జొన్నపాడు దగ్గర భోజన విరామం తీసుకోనున్నారు. అనం తరం మధ్యాహ్నం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల లోకి ప్రవేశించనుంది.

సాయంత్రం గుడివాడలో భారీ బహిరంగ సభలో జగన్ ప్రసంగించ నున్నారు.....

తప్పు చేస్తే దొరకక తప్పదు

Apr 15 2024, 10:20

నేడు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్న చంద్రబాబు

ఏపీలో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన పార్టీలు ప్రచారం జోరుగా నిర్వహిస్తున్నారు.

ఏపీలో అధికారమే లక్ష్యం గా చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేపట్టారు. నేడు శ్రీకాకుళం జిల్లాలో చంద్రబాబు పర్యటించను న్నారు.

ముందుగా విశాఖ నుంచి మధ్యాహ్నం 3గంటలకు చంద్రబాబు హెలికాఫ్టర్‌లో రాజాం నియోజకవర్గానికి చేరుకుంటున్నారు.

అనంతరం పాలకొండ, పలాస రోడ్‌షోల్లో చంద్ర బాబు ప్రసంగించనున్నారు. పలాస టీడీపీ కార్యాల యంలోనే చంద్రబాబు రాత్రికి బస చేయనున్నారు.